by సూర్య | Sun, Jan 10, 2021, 12:50 PM
సిడ్నీ టెస్టులో భారత్ కు ఆస్ట్రేలియా భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను 312/6 వద్ద డిక్లేర్ చేయడంతో ఈ టెస్టులో ఇండియా విజయం సాధించాలంటే 407 పరుగులు చేయాలి. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో లుబుషేన్ 73 పరుగులు, స్మిత్ 81 పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధించి భారత్ కు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఓవర్ నైట్ స్కోరు 103/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 312/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో నవదీప్ సైనీ, అశ్విన్లు తలో రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, సిరాజ్లు చెరో వికెట్ లభించింది.
Latest News