by సూర్య | Sun, Jan 10, 2021, 01:27 PM
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ప్రశ్నించారు. ''మీ పుట్టినరోజు సంబరాలకు, వైసీపీ ఊరేగింపులకు, బహిరంగ సభలకు, రికార్డింగ్ డాన్స్లకు కరోనా ఉండదు.. మీ నేతల కోత ముక్కలాటలకు అడ్డురాని కరోనా.. ఎన్నికలకు మాత్రం ఎందుకు అడ్డొస్తుంది?.. మీ ప్రభుత్వ విధానాలపై అపనమ్మకమా? ప్రజాగ్రహనికి భయపడా? ఎందుకు ఎన్నికలంటే భయపడుతున్నారని'' దేవినేని ఉమా నిలదీశారు.
Latest News