by సూర్య | Sat, Jan 09, 2021, 03:29 PM
సీఎం జగన్ సొంత నియోజకవర్గంలోనే ప్రజలు, దేవుళ్లకు రక్షణ లేదని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేముల మండలం చాగలేరులో సుమారు 80 కేజీల బరువుండే వినాయకుని విగ్రహం నిన్న రాత్రి మాయం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రజలు, విగ్రహాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 140 ఘటనలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో.. దుండగులు మరింత రెచ్చిపోతున్నారని విమర్శించారు. విగ్రహాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు.. చేతనైతే చర్యలు తీసుకోవాలి లేదా రాజీనామా చేయాలని సూచించారు.
Latest News