by సూర్య | Fri, Jan 08, 2021, 02:23 PM
భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన భారత ఓపెనర్లు చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. 27 వ ఓవర్లో క్యాచ్ రూపంలో 26 పరుగుల చేసిన రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మరో ఓపెనర్ శుబ్మాన్ గిల్(50) కూడా అవుట్ అయ్యాడు. రహానే, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లకు 96 పరుగులు చేసింది.
Latest News