by సూర్య | Fri, Jan 08, 2021, 02:31 PM
చలో రామతీర్థానికి బయల్దేరిన బీజేపీ - జనసేన శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఇరు పార్టీల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ , టీడీపీ నేతలను అనుమతించి తమను ఎందుకు పంపించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఎంతకూ పోలీసులు వారిని అనుమతించకపోవడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, భాజపా నేతల మధ్య తోపులాట జరిగింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా రామతీర్థం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
Latest News