by సూర్య | Fri, Jan 08, 2021, 10:31 AM
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది. తాజాగా గురువారం కూడా 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 7న) కొత్తగా 18,139 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 234 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,13,417 కి చేరగా.. మరణాల సంఖ్య 1,50,570 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
ఇదిలాఉంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది. కరోనా నుంచి నిన్న 20,539 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,00,37,398 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,25,449 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.39 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది.
దేశవ్యాప్తంగా నిన్న 9,35,369 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి జనవరి 7వ తేదీ వరకు మొత్తం 17,93,36,364 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
Latest News