by సూర్య | Thu, Jan 07, 2021, 02:44 PM
గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురువారం తెల్లవారుజామున ఇంటి ముందు పెట్టిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. స్థానికులు గుర్తించేలోపే ఆటో పూర్తిగా దగ్దమైంది. దీంతో ఆటో మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబం రోడ్డున పడింది. ఆటోలో ఉన్న కూరగాయలతో సహా బుగ్గిపాలయ్యాయని బాదితులు వాపోయారు. ఆటోని గంజాయి గ్యాంగ్ తగలబెట్టిందని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి ముందు పెట్టిన బైకుల్లో సైతం పెట్రోలు మాయమైపోతున్నాయని అని స్థానికులు వాపోతున్నారు. ఘటనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో భాదితులు ఫిర్యాదు చేశారు.
Latest News