దుర్గమ్మకు భారీ కానుకలు సమర్పించిన ఓ భక్తుడు...

by సూర్య | Mon, Oct 19, 2020, 11:37 AM

విజయవాడ దుర్గమ్మకు ఓ భక్తుడు భారీగా కానుకలు సమర్పించాడు. విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడు రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలను అందించాడు.  దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు వాటిని అందించి, ఆయన కుటుంబం ఆశీర్వాదం తీసుకుంది. అమ్మవారికి ప్రతి గురువారం నగలను అలంకరిస్తామని ఆలయ పండితులు తెలిపారు.


కాగా, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా  కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న మెదక్‌ జిల్లా ఏడుపాయలలో వన దుర్గామాతలు బ్రహ్మచారిణిగా, ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ లక్ష్మీ తాయారు ఆలయంలో అమ్మవారు సంతానలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM