by సూర్య | Mon, Oct 19, 2020, 11:34 AM
కరోనా కారణంగా దుబాయ్ కు మళ్లిన ఐపీఎల్ సీజన్ ఆటగాళ్లకు క్రికెట్ తో పాటు మంచి విహారకేంద్రంగా మారింది. ముఖ్యంగా త్వరలోనే పేరెంట్స్ కాబోతున్న విరాట్ కోహ్లి.. అనుష్కలు మాత్రం ఖాళీ సమయాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.భారత్ లో కరోనా విజృంభణతో దుబాయ్ తరలివెళ్లిన ఐపీఎల్ సీజన్ ను భారత క్రికెటర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎడారి దేశాన్ని ఆనుకుని ఉన్న సముద్రపు బీచ్ ల ఒడ్డుల వెంట తెగ తిరిగేస్తున్నారు. ఇదే క్రమంలో భారత క్రికెట్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆయన భార్య అనుష్క శర్మలు.. మ్యాచ్ లేని సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా.. దుబాయ్ లోని ఒక చారిత్రక కట్టడానికి సమీపంలో.. సముద్రంలో కోహ్లి, అనుష్య సయ్యాటలాడారు.సంధ్యా సమయంలో తీసిన ఈ ఫోటోను విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోకు మరో విశేషముందండోయ్.. దీనిని తీసినవ్యక్తి ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్.
Latest News