నాగ్‌పూర్‌లో దారుణం...తలపై ఇనుప రాడ్డుతో

by సూర్య | Mon, Oct 19, 2020, 10:32 AM

మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. తన స్నేహితుని ఇంటికి డిన్నర్‌కు వచ్చిన మరో ఫ్రెండ్... తనకు కోడిగుడ్డు కూర వండి వడ్డించలేదని ఆగ్రహించాడు. ఈ ఆగ్రహాన్ని తట్టుకోలేక తనను డిన్నర్‌కు పలిచిన స్నేహిడుతుడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,నాగ్‌పూర్‌లోని మకాపూర్ ప్రాంతానికి చెందిన బన్సారీ (40) శనివారం రాత్రి తన స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్‌ను భోజనానికి ఇంటికి ఆహ్వానించాడు. దీంతో గైక్వాడ్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత బన్సారీ, గైక్వాడ్‌లు కలిసి మద్యం సేవించారు.


పిమ్మట భోజనానికి కూర్చొన్నారు. భోజనంలో ఇంట్లో తయారు చేసిన అన్ని రకాల కూరలను వడ్డించారు. అయితే, గైక్వాడ్ మాత్రం కోడిగుడ్డు కూర ఎక్కడ అంటూ బన్సారీని ప్రశ్నించగా, అది వండలేదని బదులిచ్చాడు.దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చివరకు ముదిరిపాకనపడటంతో కోపం పట్టలేని గైక్వాడ్ ఇనుపరాడ్డుతో బన్సారీ తలపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM