విశాఖ జిల్లాలో దారుణం

by సూర్య | Mon, Oct 19, 2020, 09:47 AM

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు లేని బాలికను చేరదీసి యోగక్షేమాలు చూడాల్సిన అత్త వరసైన మహిళ నీచానికి పాల్పడింది. కూతురు వయసుండే ఆమెతో వ్యభిచారం చేయించింది.. ఆమె గర్భవతి కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. బర్మా క్యాంప్‌లో ఉంటున్న ఓ వృద్ధురాలు తన 17 ఏళ్ల మనవరాలితో ఉంటోంది. మర్రిపాలెం సాయినగర్‌ ప్రాంతానికి చెందిన వృద్ధురాలి కోడలు బాలిక బాధ్యతను తాను చూసుకుంటానని నమ్మబలికింది. ఫిబ్రవరిలో తనతో తీసుకెళ్లి తిరిగి సెప్టెంబరులో అమ్మమ్మ చెంతకు చేర్చింది.


 


 


 


బాలిక ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భవతి అని తేల్చి చెప్పారు. ఈ విషయం చైల్డ్‌లైన్‌కు చేరడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. వృద్ధురాలి కోడలు, వర్మ అనే వ్యక్తి కలిసి బాలికతో వ్యభిచారం చేయించినట్లు తేలింది. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసును దిశ పోలీసులకు అప్పగించారు. దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ దర్యాప్తు చేస్తున్నారు. బాలిక అత్తను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.


 


 

Latest News

 
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM