కరోనా వైరస్ బారిన పడిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్

by సూర్య | Fri, Oct 16, 2020, 05:23 PM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం క్యారంటైన్ లో ఉన్నానని తెలిపారు. కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా దయచేసి కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పటికే పలువురు కీలక నేతలు కరోనా బారిన పడ్డారు. మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దాదాపు మరో 63 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM