by సూర్య | Fri, Oct 16, 2020, 05:22 PM
ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని తెలిపారు. ఇప్పటి వరకు స్కూల్స్ తెరుచుకోని నేపథ్యంలో ఇంటర్లో 30 శాతం సిలబస్ తగ్గించినట్లు తెలిపారు. అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని మంత్రి తెలిపారు. స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.
Latest News