భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం..

by సూర్య | Fri, Oct 16, 2020, 01:24 PM

మరికొన్ని నెలల్లో ఆ ఇంట్లో బుజ్జి పాపాయి అడుగుపెట్టబోతుంది. తమ జీవితంలో తాము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న శుభఘడియలు దగ్గరకు రావడంతో భార్యను భర్త ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. భార్య నర్సుగా పనిచేస్తుంటే భర్త రూడా ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం భార్యాభర్తలిద్దరూ ఒకే బస్ లో ప్రయాణం చేస్తున్నారు. భార్యను ముందు స్టాప్ దగ్గర జాగ్రత్తగా దించాడు. సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పి బస్సు ఎక్కుతుండగా ఘోరం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్నలారీ తన భార్యను మృత్యువులా కాటేస్తోందని ఊహించలేకపోయాడు.
ఈ విషాధ ఘటన గురువారం కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అలప్పుజ కు చెందిన షెల్మి పౌలస్ (33) చండీరూర్ లో ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె భర్త సినోజ్ అదే ఊళ్లో ప్రయివేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం దంపతులిద్దరూ ఒకే బస్ లో ఆఫీసుకు బస్సులో బయలుదేరారు. ఆమె స్టాప్ ముందు వచ్చింది. అక్కడ దిగిన ఆమె మరో ఎక్కి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంది. అందుకు భర్త జాగ్రత్తలు చెప్తుండగా బస్సు స్టార్ట్ అయ్యింది.
భార్య వేరే బస్సు ఎక్కుతుందా లేదా అని భర్త చూస్తున్నాడు. ఇంతలో తన భార్య ఆస్పత్రికి వెళ్లేందుకు మరో బస్సు ఎక్కుతుండగా జారిపడిపోయింది. ఇంతలో కొచ్చి వైపు నుంచి వేగంగా దూసుకువస్తున్న లారీ ఒకటి ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డంతా రక్తంతో నిండిపోయింది. ఇంతలో అక్కడే ఉన్న అంబులెన్స్ లో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆమె మృతి చెందింది. తన కళ్లెదుటే భార్య మృతి చెందడంతో బోరున విలపించాడు. ఆ గర్భిణీని ఢీ కొట్టిన లారీ ఆంధ్రప్రదేశ్ కు చెందినదని పోలీసులు గుర్తించారు. రొయ్యలను సరఫరా చేసే ట్రక్ అని తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest News

 
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM