by సూర్య | Mon, Oct 12, 2020, 10:20 AM
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా రోజుకు 50వేలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 66,732 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం పేర్కొంది. మహమ్మారి కారణంగా కొత్తగా 816 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి చేరింది. ఇందులో 8,61,853 క్రియాశీల కేసులున్నాయి. 61,49,536 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు. వైరస్ కారణంగా 1,09,150 మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఆదివారం ఒకే రోజు 9,94,851 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు 8,78,72,093 టెస్టులు చేసినట్లు వివరించింది.
Latest News