ప్రైవేటు బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా

by సూర్య | Sat, Oct 10, 2020, 10:12 AM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీగ‌ఢ్ జిల్లాలో ఓ ప్రైవేటు బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌గా, ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న బ‌స్సు ఈరోజ తెల్ల‌వారుజామున ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీగ‌ఢ్ జిల్లా చేరుకున్న‌ది. జిల్లాలోని త‌ప్పాల్ ప్రాంతంలో అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు మ‌ర‌ణించారు. ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో వారిని స‌మీప ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 45 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. 


కాగా, బ‌స్సు ప్ర‌మాదంపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు తీవ్ర సంతాపం తెలిపారు. గాయ‌ప‌డిన‌వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు.   

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM