by సూర్య | Sat, Oct 10, 2020, 10:12 AM
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్సు ఈరోజ తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లా చేరుకున్నది. జిల్లాలోని తప్పాల్ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీప దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
కాగా, బస్సు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Latest News