by సూర్య | Fri, Oct 09, 2020, 05:25 PM
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి సోమవారం ఉదయం తీరం దాటే సూచనలున్నాయని, శనివారం నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45- 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Latest News