ఏపీ కరోనా బులిటెన్...

by సూర్య | Wed, Oct 07, 2020, 06:16 PM

గత కొన్ని నెలలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ భూతం క్రమంగా పట్టు సడలిస్తోంది. ఏపీలోనూ కరాళ నృత్యం చేసిన ఈ రాకాసి వైరస్ ఇప్పుడు మునుపటి స్థాయిలో ప్రభావం చూపడంలేదు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా గణాంకాలే అందుకు నిదర్శనం.


గడచిన 24 గంటల్లో ఏపీలో 5,120 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 807 కేసుల చొప్పున వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 144 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో మరో 34 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజాగా 6,349 మందికి కరోనా నయం అయింది.


మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివరకు 7,34,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 6,78,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల సంఖ్య 6,086కి పెరిగింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM