by సూర్య | Sun, Mar 29, 2020, 02:15 PM
కరోనావైరన్పై పోరుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ నడుం బిగించింది. ఇప్పటికే అత్యంత చౌకగా వెంటిలేటర్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఈ సంస్థ తాజాగా ఫేస్ షీల్డ్ తయారీని ప్రారంభిస్తోంది. ఈ మేరకు మహీంద్రా సంస్థ ఎండీ పవన్ గోయంకా ట్విట్టర్ వేదికగా రేపటి నుంచి మహీంద్రా ఫేస్ షీల్డ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలుత వీటిని రోజుకు 500 యూనిట్లు ఉత్పత్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మరింత వేగవంతం చేస్తామని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
Latest News