by సూర్య | Sun, Mar 29, 2020, 02:09 PM
తీహార్ జైలులోని 419 మంది ఖైదీలను కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా శనివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బెయిల్పై, మరో 63 మందిని ఎనిమిది వారాల అత్యవసర పెరోల్పై విడుదల చేసినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. మొత్తం 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతలో శనివారం 419 మందిని విడుదల చేశారు. రానున్న రోజుల్లో మరికొంత మందిని ఇళ్లకు పంపుతామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.
Latest News