by సూర్య | Sun, Mar 29, 2020, 01:55 PM
యూపీలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత మూడు రోజుల్లో స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన యూపీ కార్మికులను క్వారంటైన్లో ఉంచాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. క్వారంటైన్లో ఉన్న వారికి అన్ని సౌకర్యాలూ కల్పించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయా కార్మికుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను జిల్లాల మెజిస్ట్రేట్లకు పంపించింది.
Latest News