by సూర్య | Sun, Mar 29, 2020, 01:53 PM
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో గల ఖుర్జాలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ బాధిత కుటుంబానికి చెందిన 50 మంది సన్నిహిత బంధువులను గుర్తించింది. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి మీరట్లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. తరువాత ఆ వ్యక్తి మసీదులో నమాజు కూడా చేశాడు. ముందుగా అతనికి కరోనా పాజిటివ్ రాగా, అతని కుటుంబసభ్యులను పరీక్షించగా కుటుంబంలోని ఐదుగురికి కరోనా సోకినట్లుగా వైద్యులు గుర్తించారు.
Latest News