by సూర్య | Sat, Mar 28, 2020, 02:29 PM
అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టాలినా జార్జివా కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి జారిపోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్థమాన దేశాలను ఆదుకోవడానికి భారీగా నిధులు అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం ఆర్ధిక మాంద్యంలోకి వెళ్లిపోయిందని, 2008లో తలెత్తిన పరిస్థితి కన్నా ఇది చాలా దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆకస్మికంగా ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడినందువల్ల వర్థమాన దేశాల ఆర్థిక అవసరాలు తీర్చడానికి కనీసం 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమని చెప్పారు.
Latest News