by సూర్య | Sat, Mar 28, 2020, 11:28 AM
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14కి చేరింది. వీటిలో ఒక వ్యక్తికి మాత్రం కరోనా వైరస్ తొలగిపోవడంతో... అతన్ని డిశ్చార్జి చేశారు. ఈ కేసుల్లో 11 విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకినవి కాగా... 3 మాత్రం స్థానికంగా రాష్ట్రంలో ఉన్నవారికే వచ్చినవి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ 406 మంది అనుమానితులకు కరోనా శాంపిల్ టెస్టులు జరిపించింది. ఒక్క విశాఖలోనే 4 కేసులు ఉండగా... కృష్ణా జిల్లాలో 3, గుంటూరులో 2 కేసులున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రిలో ఒక్కో కేసు ఉన్నాయి.
Latest News