by సూర్య | Fri, Mar 27, 2020, 02:07 PM
దేశంలోని ఐదు జంతు పరిరక్షణ సంస్థలకు చెందిన ప్రతినిధులు సంయుక్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మాంసం మార్కెట్లను పూర్తిగా మూసివేయాలని కోరుతూ లేఖ రాశారు. కరోనా వైరస్ ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా మాంసం మార్కెట్లను మూసివేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని పీపుల్స్ ఫర్ ఎనిమల్స్, హ్యుమనీ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా, మెర్సీ ఫర్ ఎనిమల్స్ ఇండియా ఫౌండేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎనిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్, అహింసా ట్రస్టులు కలిసి కేంద్రమంత్రికి లేఖ రాశాయి. చైనా దేశంలోని వూహాన్ నగరంలో వన్యప్రాణుల మాంసం తినడం వల్లనే కరోనా వైరస్ ప్రబలిందని, దీనివల్ల వేలాదిమంది మరణించినందున మాంసం విక్రయాలను నిలిపివేయాలని కోరారు.
Latest News