ఏపీలో 11కు చేరిన కరోనా కేసులు

by సూర్య | Fri, Mar 27, 2020, 09:24 AM

ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్వీడర్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. మార్చి 18న యువకుడు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చాడు. కరోనా లక్షణాలతో అతను మార్చి 25న విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి వచ్చిన రిపోర్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 11కి చేరింది. గురువారం రాత్రి వైద్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఈ వివరాలు వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు 360 మంది కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. 317 మందికి నెగటివ్ వచ్చింది. 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 32 మంది రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు 104కి కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని సీఎం జగన్ ప్రజలను కోరారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM