లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు: సోనియాగాంధీ

by సూర్య | Thu, Mar 26, 2020, 05:10 PM


కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ లాక్‌డౌన్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గురువారం లేఖ రాశారు. ఆ లేఖలో సోనియా కరోనా వైరస్‌ లక్షలాదిమంది జీవితాలను ప్రమాదంలో పడేసిందన్నారు. కరోనా మహమ్మారిపై విజయానికి దేశం ఒక్కతాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలకోసం కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని సోనియా పేర్కొన్నారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా సరకు రవాణాను సులభతరం చేయాలని, బ్యాంకుల ఈఎంఐలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సోనియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM