by సూర్య | Thu, Mar 26, 2020, 02:53 PM
కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఇరాన్ నుంచి 277 మంది భారతీయులు ఈ రోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకోగానే నిబంధనల ప్రకారం వారిని పరీక్షించిన అధికారులు.. అక్కడి నుంచి వారిని జోధ్పూర్ మిలిటరీ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కరోనా శిబిరానికి తరలించారు. వారందరికీ అన్ని సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కావలసినంత మంది వైద్య సిబ్బందిని పంపింది. కాగా 277 మందిలో 149 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు
Latest News