by సూర్య | Thu, Mar 26, 2020, 01:47 PM
ముంబై నగరంలో కరోనా వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయడానికి ముంబైలో కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనల అమలును పర్యవేక్షించడానికి పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ముంబై వీధుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు కోరుతూ ప్రచారం చేయడంతో పాటు ఎవరూ బయటకు రాకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇళ్లలోనుంచి బయటకు రాకుండా ఉండటం ఒక్కటే పరిష్కారమని, ఎలాంటి కారణం లేకుండా ఎవరైనా ఇళ్లలోనుంచి బయటకు వస్తే వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు.
Latest News