by సూర్య | Thu, Mar 26, 2020, 10:45 AM
గుంటూరు : గుంటూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అధికారులు తెలిపిన వివరాల మేరకు... దుబారు నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. దుబారు నుంచి వచ్చిన తరువాత ఆ వ్యక్తి జనం మధ్య యథావిధిగా తిరిగాడు. 500 మందికి విందు కూడా ఇచ్చాడు. రెండు రోజుల క్రితం ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. రిపోర్ట్ లను వైద్య ఆరోగ్య అధికారులు పరీక్షలకు పంపారు. స్టేజి -1 లో పాజిటివ్ గా నమోదయింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై మంగళదాస్ నగర్ లో ఇంటింటి సర్వే చేపట్టింది.
Latest News