ఒలింపిక్స్ ఏడాది వాయిదా : డిక్ పౌండ్‌

by సూర్య | Tue, Mar 24, 2020, 10:10 AM

 ఈ ఏడాది జూలైలో జ‌పాన్‌లో జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను ఏడాది పాటు వాయిదా వేయాల‌నుకుంటున్న అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ స‌భ్యుడు డిక్ పౌండ్ తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. టోక్యో క్రీడ‌ల‌కు త‌మ అథ్లెట్ల‌ను పంప‌డం లేద‌ని బ్రిటీష్ ఒలింపిక్ సంఘం కూడా తేల్చి చెప్పింది.  దీంతో ఐఓసీ ఓ నిర్ణ‌యాన్ని వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, కెన‌డా దేశాలు ఇప్ప‌టికే త‌మ అథ్లెట్ల‌ను పంప‌వ‌ద్దు అని నిర్ణ‌యించాయి. 


ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం మేర‌కు, ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఐఓసీ స‌భ్యుడు డిక్ పౌండ్ స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో జూలై 24వ తేదీన క్రీడ‌లు ఆరంభం కావ‌డంలేద‌న్నారు.  ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ‌పై ఐఓసీకి నాలుగు వారాల గ‌డువు ఇచ్చినా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వాయిదా నిర్ణ‌యం త‌ప్ప‌ద‌ని పౌండ్ తెలిపారు. 2021లో ఈ క్రీడ‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి.


కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా అనివార్యం కావొచ్చని జపాన్‌ ప్రధాని షింజో అబే చెప్పారు. సోమవారం జపాన్‌ పార్లమెంట్‌లో విశ్వక్రీడల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ‘ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు జపాన్‌ పూర్తి నిబద్ధతతో ఉంది. కానీ, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఆలస్యంగా నిర్వహించడం అనివార్యమవుతుంది. అందుకే వాయిదా వేయాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చు. అయితే రద్దు చేయడం ఆప్షనే కాదు’ అని అబే చెప్పారు. 

Latest News

 
నియోజకవర్గ అభివృద్ధికై తోపుడు బండి గుర్తుకు ఓటు వేయండి Wed, May 01, 2024, 05:00 PM
డీఎస్పీ ఆధ్వర్యంలో పులివెందులలో కవాతు Wed, May 01, 2024, 04:57 PM
మే డే సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరణ Wed, May 01, 2024, 04:55 PM
ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సోదరుడు ప్రచారం Wed, May 01, 2024, 04:53 PM
ప్రజా సేవా కార్యక్రమంలో శ్రీ వినాయక ఫౌండేషన్ Wed, May 01, 2024, 04:51 PM