పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను నిరవధికంగా వాయిదా

by సూర్య | Tue, Mar 24, 2020, 08:41 AM

అమరావతి :కరోనా ప్రభావంతో పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన తరుణంలో రాష్ట్రంలో బడ్జెట్​ సమావేశాల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభ బడ్జెట్​ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీనిపై సమీక్షించిన సీఎం జగన్​.. బడ్జెట్​పై ఆర్జినెన్స్​ జారీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ఈనెల 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్​ ఉంది. దీనిలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలందరూ ఆ రోజున శాసనసభకు రావాలి. 


ఒకవేళ రాజ్యసభ ఎన్నికలు​ వాయిదా పడితే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలను కూడా తాత్కాలికంగా నిలిపివేయవచ్చన్న అంశంపైనా సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలనూ నిలిపివేసే ప్రకటన జారీ చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికల పోలింగ్​ యథావిధిగా జరిగితే 27 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


 


 

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM