by సూర్య | Sat, Mar 21, 2020, 05:05 PM
కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో ఆందోళనకర పరిస్థితులున్నాయి. పూణేలో విదేశాలకు వెళ్లని స్థానిక మహిళకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. నాగ్ పూర్ లో సమూహాల ద్వారా వైరస్ వ్యాపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అదే విధంగా మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
రైళ్లు,బస్సు సర్వీసులను రద్దు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో 52 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో 49 మంది మహారాష్ట్ర వారు కాగా, ముగ్గురు విదేశీయులు. కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో ఒక మరణం సంభవించింది.