by సూర్య | Sat, Mar 21, 2020, 04:33 PM
కరోనాపై అధికారులతో ఏపీ గవర్నర్ ఈ రోజు రాజ్ భవన్ లో బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం, పౌర సమాజం సంయిక్త భాగస్వామ్యంతోనే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకు రాగులుతామని ఆయన అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ నీలం సహాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కరోనా రాష్ట్ర ప్రత్యేక అధికారి విజయ రామరాజు, కేంద్రం నుంచి ప్రత్యేకంగా నియమించబడిన ప్రత్యేక అధికారి సురేష్ కుమార్, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్ధితిని నీలం సహానీ గవర్నర్ కు వివరించారు.
Latest News