జనతా కర్ఫ్యూ పాటించాలి: కన్నా

by సూర్య | Sat, Mar 21, 2020, 04:17 PM

కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 22న(ఆదివారం) ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేసారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు మాత్రమే బయటకు వెళ్లాలని కోరారు. అత్యవసర సేవలు అందించే వారికి కృతజ్ఞతగా ఇంటి కిటికీలు, బాల్కనీల వద్ద నిలుచుని చప్పట్లు కొట్టాలన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని కోరారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM