by సూర్య | Sat, Mar 21, 2020, 04:17 PM
కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 22న(ఆదివారం) ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేసారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు మాత్రమే బయటకు వెళ్లాలని కోరారు. అత్యవసర సేవలు అందించే వారికి కృతజ్ఞతగా ఇంటి కిటికీలు, బాల్కనీల వద్ద నిలుచుని చప్పట్లు కొట్టాలన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని కోరారు.
Latest News