by సూర్య | Sat, Mar 21, 2020, 08:11 AM
రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరరాజే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఈ రోజు వెల్లడించారు. తను, తనతో పాటు తన కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నామని ఆమె తెలిపారు. సింగర్ కనికా కపూర్ ఇచ్చిన ఓ పార్టీకి తామిద్దరం వెళ్లామనీ, ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా తామిద్దరం క్వారంటైన్ లోకి వెళ్లామని ఆమె పేర్కొన్నారు. సింగర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పార్టీకి హాజరైన వారందరూ స్వయంగా క్వారంటైన్లోకి వెళ్లిపోవాలని, ఏవైనా కరోనా లక్షణాలుంటే వెంటనే తమకు తెలియజేయాలని అధికారులు సూచించారు.
Latest News