ఐపీఎల్‌లో ఆర్‌సీబీ పేరు, లోగో మార్పు

by సూర్య | Fri, Feb 14, 2020, 05:22 PM

 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈ దశాబ్దాన్నిగొప్పగా ఆరంభించాలని భావిస్తోంది. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్‌సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. జట్టులో స్టార్‌హిట్టర్లు, ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ పేలవ ప్రదర్శనతో ప్రతీ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో ఆర్‌సీబీ తన ఖాతాల పేర్లలో మార్పులు చేసింది. రెండు రోజుల క్రితం ప్రొఫైల్‌ ఫొటో, కవర్‌ ఫొటోలను తొలగించిన ఆర్‌సీబీ యాజమాన్యం తాజాగా ఫ్రాంఛైజీ పేరును రాయల్‌ ఛాలెంజర్స్‌గా పేర్కొంది. గర్జిస్తున్న సింహాంతో కొత్త లోగోను డిజైన్‌ చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లోనూ ఇలాంటి మార్పులే చేసింది. పేరుతోనైనా తమ రాత మారుతుందని భావించి.. తమ జట్టు పేరును ఆర్‌సీబీ మార్చుకోవడం విశేషం. గతేడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా 2019 సీజన్‌కు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 29 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభం కానుంది.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM