టీడీపీ నేతలను బెంబేలెత్తిస్తోన్న వైసీపీ మంత్రి

by సూర్య | Fri, Feb 14, 2020, 04:49 PM

జగన్ క్యాబినెట్ లో బలమైన మంత్రులు చాలామందే ఉన్నా రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శించే మంత్రులు మాత్రం కొద్ది మందే ఉన్నారు. ఈ వరుసలో ముందు నుంచి వైసీపీ పార్టీకి వాయిస్ గా నిలబడుతూ వస్తున్న ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పుకోవచ్చు. రాజకీయ విమర్శలు చేయడంలోనూ తమ పార్టీ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ ఎవరైనా విమర్శలు చేస్తే తిప్పికొట్టడంలో కానీ అనిల్ కుమార్ యాదవ్ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటికే జగన్ క్యాబినెట్ లో మంత్రి గా ఉన్న కొడాలి నాని వివాదాస్పదంగా మారారు. చంద్రబాబును, ఆ పార్టీ నాయకులను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కొడాలి నాని హాట్ హాట్ గా చేసే విమర్శలు పెద్ద చర్చనే లేవదీస్తున్నాయి.
ఆ బాటలోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా నడుస్తున్నారు. చంద్రబాబు లోకేష్ ను టార్గెట్ గా చేసుకుంటూ ఆయన తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల దుస్థితిని వివరిస్తూ ఆధారాలు లెక్కలతో సహా అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న విమర్శలకు టిడిపి నాయకుల వద్ద సమాధానం కరువవుతోంది. అదే సమయంలో చంద్రబాబు తనయుడు లోకేష్ ను ఉద్దేశించి వెటకారంగా డైలాగులు చెబుతూ ఛలోక్తులు విసరడంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ ముందుంటున్నారు.
ఏది పడితే అది ఎవరిని పడితే వారిని ఉద్దేశించి అనిల్ కుమార్ విమర్శలు చేస్తున్నా ఆ పార్టీ అధినేత జగన్ పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నాయకులు తరుచుగా వ్యాఖ్యానిస్తునాన్రు. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి పార్టీకి తలఓంపులు రాకుండా విధానపరంగా మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో నెలకొన్న లోపాలను ఎత్తిచూపిస్తూ అనిల్ కుమార్ చేసే విమర్శలకు సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే అనిల్ కుమార్ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళడానికి కారణం అవుతోంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM