by సూర్య | Thu, Feb 13, 2020, 05:36 PM
కొవిడ్-19 కొత్త కేసులు జనవరి తర్వాత మొదటిసారిగా తగ్గు ముఖం పట్టాయని తాజాగా చైనా వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ చివరి నాటికి దీని ప్రభావం పూర్తిగా ఉండబోదని చైనా సీనియర్ వైద్య సలహాదారులు అంచనా వేశారు. అయితే చైనా అధికారులు చేసిన ఈ ప్రకటనను అంతర్జాతీయ నిపుణులు విభేధిస్తున్నారు. మరణాల సంఖ్య వేలలో ఉన్న తరుణంలో ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటేనని కొట్టిపడేశారు. ఓ వైపు ప్రపంచానికి కరోనా ప్రమాదం మరింత పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంటే, చైనా అధికారులు మాత్రం పరిస్టితి అదుపులోనే ఉందని తెలపడం విమర్శలకు తావిస్తోంది
Latest News