మా ప్రదర్శన విజయానికి సరిపోలేదు : కెప్టెన్ కోహ్లీ

by సూర్య | Wed, Feb 12, 2020, 04:13 PM

వన్డే సిరీస్ ఓటమి తర్వాత స్పందించిన జట్టు  సారథి విరాట్ కోహ్లీ  మాట్లాడుతూ... ఈ మూడు వన్డేల సిరీస్ లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో లేవని, మ్యాచ్ లు గెలిపించడానికి తమ జట్టు చేసిన ప్రయత్నాలు సరిపోవని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లో తమ ప్రదర్శన పర్లేదు అనిపించినా,విజయానికి  ఆ ప్రదర్శనలు సరిపోవని కోహ్లీ  పేర్కొన్నాడు. టి20 సిరీస్ ఓటమి తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు గెలుపు పై త్రివమైన కసితో బరిలో దిగారని, ఈ విషయంలోనే తాము వెనుకబడిపోయామని కోహ్లీ అంగీకరించాడు. ఇక తమ దృష్టంతా రాబోయే టెస్టు సిరీస్ పైనే ఉందని, టెస్టుల్లో తమది సమతూకంతో ఉన్న జట్టు అని అభివర్ణించాడు. అయితే, మైదానంలో దిగినప్పుడు సరైన దృక్పథం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. కాగా, టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఈ నెల 21న ఆరంభం కానుంది. అంతకుముందు భారత్ ఓ ప్రాక్టీసు మ్యాచ్ ఆడనుంది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM