by సూర్య | Wed, Feb 12, 2020, 01:57 PM
ఢిల్లి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్తో సహా మొత్తం మంత్రివర్గమంతా ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా చెప్పారు. రామ్లీలా మైదాన్లో ఈ నెల 16వ తేదీన ఉదయం పదిగంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్పై కాల్పులు జరిపిన ఘటనపై సిసోడియా స్పందించారు. ఢిల్లిలో శాంతిభద్రతల నిర్వహణకు బాధ్యులైన వారే ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని ఆయన అన్నారు.
Latest News