by సూర్య | Tue, Feb 11, 2020, 07:40 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దిశగా దూసుకెళుతోన్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టపాసులు పేల్చొద్దని తమ పార్టీ నేతలు, కార్యకర్తలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. వాటికి బదులుగా మిఠాయిలు పంచాలని చెప్పారు. దీంతో ఆయన ఆదేశాలను ఆప్ నేతలు కార్యకర్తలు పాటిస్తున్నారు. టపాసులకు బదులుగా బెలూన్లను గాల్లోకి వదిలిపెడుతూ, మిఠాయిలు పంచుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.
Latest News