కాంచీపురంలో సంక్రాంతికి వింత ఆచారం

by సూర్య | Fri, Jan 17, 2020, 03:34 PM

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కాంచీపురంలో సంక్రాంతికి ఓ వింత సంప్రదాయాన్ని అనుసరిస్తారు. సంక్రాంతి పండుగకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు పాటిస్తుంటారు. కానీ కాంచీపురంలో సంక్రాంతికి అడివికి వెళ్లి ఓ కుందేలును పట్టుకొచ్చి బంగారంతో చెవులు కుట్టిస్తారు. ఇలా చేయడం వల్ల తమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని, ప్రజలందరూ భోగభాగ్యాలతో తులతూగుతారని అక్కడి ప్రజలు నమ్మకం.


అందుకే అడవి కుందేలును తీసుకొచ్చి దానికి బంగారంతో చెవులు కుట్టించిన తర్వాత గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం వరదరాజ స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీని గ్రామస్తులు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈసారి కూడా అడవి కుందేలుకు చెవులు కుట్టించి పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM