by సూర్య | Fri, Jan 17, 2020, 01:29 PM
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. రాజ్కోట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫింట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫలితంగా టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో కోహ్లీసేన రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేసిన రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో మనీష్ పాండే, నవదీప్ సైనీలకు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో మనీష్ పాండే 2018 తర్వాత భారత్ తరుపున వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు.
Latest News