by సూర్య | Fri, Jan 17, 2020, 01:31 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణమాలపై స్పందిస్తూ జనసేన పార్టీ అంతర్జాతీయ పార్టీ కూడ కావొచ్చేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. అయినా పవన్ కళ్యాణ్ ఏం చేస్తే మాకేం సంబంధం అని.. ఆయన రాజకీయాలపై ఏపీ ప్రజలే చూసుకుంటారని కేటీఆర్ అన్నారు. ఇక ఏపీ రాజధాని రగడపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజధాని మారుస్తామంటే ఆందోళనలు జరుగుతున్నాయని.. తెలంగాణలో చిన్న ఆందోళనలు కూడ లేకుండా జిల్లాల విభజన చేశామని కేటీఆర్ తెలిపారు. రాజధాని మార్పుపై వస్తున్న వ్యతిరేకత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో చేసిన చిట్ చాట్లో కేటీఆర్ ఈ అసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Latest News