by సూర్య | Fri, Jan 17, 2020, 09:49 AM
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 12 నుంచి మర్చి 1 వరకు సమావేశాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత బడ్జెట్ సెషన్ జరగనున్నది. మర్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత బడ్జెట్ సెషన్ నిర్వహించనున్నారు.
Latest News