ప్రియురాలికి ఎలుకల మందు తాగించిన ప్రియుడు

by సూర్య | Thu, Jan 16, 2020, 02:51 PM

కర్ణాటక తాలూకా తొండేబావి హోబళీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడు ప్రియురాలిపై అనుమానంతో ఎలుకల మందు తాగించి చనిపోయేలా చేశాడు. కమలాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరిట ఆమె వెంటపడ్డాడు. అతని ప్రేమను ఆమె కూడా అంగీకరించింది. తనతో కాకుండా మరో వ్యక్తితో కూడా ప్రేమ వ్యవహారం నడుపుతుందేమోనని బాలికపై వెంకటేశ్ కి అనుమానం వచ్చింది.


ఈ క్రమంలో ఆమెను చంపేయాలని అనుకున్నాడు. ఈనెల 6న తొండేబావి సమీపానికి రమ్మని చెప్పి నీ ప్రేమ పరిశుద్ధమైనదైతే ఈ ద్రావణాన్ని తాగాలని బలవంతం చేశాడు. బాలిక సరే అని చెప్పేసి తాగేసింది. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు.


తాను తాగేసింది ఏంటో తెలుసుకోకుండా ఇంటికి వచ్చిన బాలిక కడుపునొప్పి.. వాంతులతో బాధపడింది. దీంతో బాలికను ఆమె అన్న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. మందు ప్రభావంతో బాలిక మరణించింది. బాలిక మరణించడంతో ప్రియుడు వెంకటేశ్ తనను పోలీసులు పట్టుకుపోతారని భావించాడు. పోలీసులు తనను తీసుకెళ్లకుండా చిన్న డ్రామా చేద్దామనుకున్నాడు. తన నోటికి ఎలుకల మందును పూసుకొని ఆత్మహత్య చేసుకోబుతున్నట్లు నటించాడు.


బాలుడు వెంకటేశ్ ఏం తాగేసాడో అని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు వెంకటేశ్ ఏమీ తాగలేదని చెప్పారు. దీంతో పోలీసులు వెంకటేశ్ ను విచారించి బాలికకు మందు తాగించింది ఇతడేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. మంచేనహళ్లి పోలీసులు వెంకటేశ్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు Tue, May 14, 2024, 12:08 PM
నా గెలుపు కోసం ఓటు వేసిన సానుభూతిపరులకు కృతజ్ఞతలు Tue, May 14, 2024, 11:15 AM
జంబులా పరమేశ్వరి ఆలయంలో విశేష పూజలు Tue, May 14, 2024, 11:08 AM
గుంతకల్లులో 76. 84 శాతం పోలింగ్ Tue, May 14, 2024, 10:56 AM
పోలీసుల సమక్షంలోనే కొట్టారు... మంత్రి జోగి రమేష్ Mon, May 13, 2024, 09:16 PM