by సూర్య | Thu, Jan 16, 2020, 02:09 PM
కర్ణాటకలోని బెంగళూరు పోలీసులు ‘వియ్ ఫర్ ఉమెన్’ పేరుతో మహిళా పోలీసులతో బైక్ రైడింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సమాజంలో మగవారి ఆధిపత్యాన్ని, జెండర్ బేధాలను తొలగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నగర డీసీపీ దివ్య సారా థామస్ మాట్లాడుతూ.. బెంగళూరు నగరం మహిళలకు సురక్షితమే అని ఈ పోలీసుల బృందం ద్వారా స్త్రీలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ బృందంలో సబ్ఇన్స్పెక్టర్ ర్యాంకు 15 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లపై రెండు దశల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం వారు బెంగళూరు నగర వీధుల్లో గస్తీ తిరుగుతారని తెలిపారు
Latest News