by సూర్య | Thu, Jan 16, 2020, 01:53 PM
హర్యానాలోని హిస్సార్ మున్సిపాలిటీ పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే 525 ఆవులు మృతి చెందాయి. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జైకృష్ణ అబిర్ మాట్లాడుతూ... గడిచిన నెల రోజుల వ్యవధిలో 525 ఆవులు మృతి చెందాయని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీధుల్లో తిరుగుతున్న ఆవులను గోశాలలకు తరలించారు. 2,500 ఆవులను గోశాలలకు తరలించామని కమిషనర్ తెలిపారు.. ఆవుల సంరక్షణ చూసుకునేందుకు 18 మంది సిబ్బంది ఉన్నారని.. అయితే 30 నుంచి 35 ఆవుల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించామని... ఆవుల మృతికి ప్లాస్టిక్ వస్తువులే కారణమని అన్నారు. ఆవుల కడుపునిండా ప్లాస్టిక్ పదార్థాలే ఉన్నాయని కమిషనర్ తెలిపారు.
Latest News