by సూర్య | Tue, Jan 14, 2020, 11:20 AM
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి వేడుకలు పాల్గొన్నారు. మీ కష్టనష్టాలు భోగి మంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుంచి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రసరించాలని కోరుకుంటూ.. మన పెద్దలు పూర్వీకులను స్మరించుకుంటూ వారు చూపిన సన్మార్గంలో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను అని అయన తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను అని అయన అన్నారు. భోగిమంటలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, పల్లెసీమలు, గంగిరెద్దులు, హరిదాసులు, ధాన్యపు రాశులు, పశువులకు అలంకరణలు ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగే సంక్రాంతి అని అన్నారు.
Latest News